ఆదర్శ డివిజన్గా అభివృద్ధి చేస్తా
టీఆర్ఎస్ అభ్యర్థి గుండు సుధారాణి విస్తృత ప్రచారం
అడుగడుగునా ప్రజల నీరాజనం
వరంగల్, ఏప్రిల్ 19 : ఆదరించి.. ఆశీర్వదించి గెలిపించాలని టీఆర్ఎస్ 29వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గుండు సుధారాణి ప్రజలను కోరారు. సోమవారం రామన్నపేటలోని బొడ్రాయి వద్ద పూజలు చేసిన ఆమె డివిజన్లో ప్రచారం ప్రారంభించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు వెంటరాగా డివిజన్లోని గంగపుత్ర కాలనీ, బీసీ కాలనీ, గాంధీ సెంటర్లో ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అడుగడుగునా ప్రజలు నీరాజనం పట్టారు. ఇంటి మనిషిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ఇక్కడి సమస్యలు తెలుసు. ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేశాను. మరో అవకాశం కల్పిస్తే డివిజన్ను ఆదర్శ డివిజన్గా మారుస్తాను.’ అని అన్నారు.
డప్పుచప్పుళ్లతో హోరెత్తిన ప్రచారం..
డప్పు చప్పుళ్లతో 29వ డివిజన్లో గుండు సుధారాణి ప్రచారాన్ని హోరోత్తించారు. కళాకారుల నృత్యాలు, తెలంగాణ పాటలతో ప్రచారం జోరుగా సాగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలతో సుధారాణి డివిజన్లో మొదటి రోజు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గుండు సుధారాణికి ప్రజలు బొట్టుపెట్టి సాదర స్వాగతాలు పలికారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండు అశ్రిత, నాయకులు పూజారి కుమారస్వామి, రుద్ర శ్రీనివాస్, తాళ్లపెల్లి రమేశ్, శ్రీను, గుండు శ్రీనివాస్, కాసర్ల చంద్రమౌళి, కుళ్ల నవీన్, సామల శ్రీనివాస్, పెద్దపల్లి కృష్ణ, కందుకూరి సత్యం, నక్క జ్యోతి, చిట్యాల మధు, సారంగపాణి, సంజీవ్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
భయపడాల్సిన పరిస్థితి లేదు.. జాగ్రత్తగా ఉండాలి : మంత్రి ఈటల
బావ ముఖేశ్కు బర్త్డే విషెష్ చెప్తూ టీనా అంబానీ పోస్ట్..!