వాషింగ్టన్: క్వాడ్ దేశాల విద్యార్థులకు అమెరికా ఆఫర్ ప్రకటించింది. ప్రతి ఏడాది వంద మంది విద్యార్థులకు ఫెల్లోషిప్ ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. క్వాడ్ గ్రూపులో ఉన్న ప్రతి దేశం నుంచి 25 మందికి ఈ అవకాశం కల్పించనున్నారు. అమెరికాలో స్టెమ్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీల్లో మాస్టర్స్, డాక్టర్స్ డిగ్రీ చదివేవారికి ఈ ఫెల్లోషిప్ ఇస్తారు. క్వాడ్ గ్రూపులో ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఉన్నాయి.
కోవిడ్ వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, వాతావరణ సమస్యలు పెరిగాయని, ప్రాంతీయ భద్రత మరింత జఠిలంగా మారిందని, అన్ని దేశాలను మహమ్మారి దెబ్బతీసినట్లు క్వాడ్ దేశాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. కానీ దేశాల మధ్య సహకారం తగ్గలేదన్నది. హెల్త్కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకు వచ్చింది. ఇండియాతో కలిసి ఆ దేశం వ్యాక్సిన్, డ్రగ్స్పై అమౌంట్ను ఖర్చు చేయనున్నది. జపాన్కు చెందిన జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్.. హెల్త్కేర్ రంగంలో సుమారు వంద మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ దేశాలు బలోపేతం కావాలని ఆ ప్రకటనలో తెలిపాయి.