భువనేశ్వర్: నిర్మాణంలో ఉన్న రోడ్డుపై ఉన్న భారీ కొండచిలువను స్నేక్ హెల్ప్లైన్ సిబ్బంది కాపాడారు. ఒడిశాలోని జాజ్పూర్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న రహదారి సమీపంలో ఇండియన్ రాక్ కొండచిలువ కనిపించినట్లు తమకు ఫోన్ కాల్ వచ్చిందని స్నేక్ హెల్ప్లైన్ సభ్యుడు ప్రమోద్ తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి కొండచిలువను పట్టుకుని రక్షించానని, అనంతరం దానిని సురక్షిత ప్రాంతంలో వదిలేసినట్లు ఆయన చెప్పారు. కాగా, పట్టుకొన్న ఈ కొండచిలువను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.