సీఎంగా కెప్టెన్ అమరిందర్ సింగ్ రాజీనామా చేసిన 24 గంటల్లో పంజాబ్ సీఎంగా చరణ్జిత్ చన్నీ పేరును కాంగ్రెస్ హై కమాండ్ ఖరారు చేసింది. ఈ సంగతిని పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జీ హరీశ్ రావత్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను సమయం కోరినట్లు హరీశ్ రావత్ తెలిపారు. చరణ్జిత్ చన్నీ ఎంపిక వెనుక పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
సుఖ్జిందర్ రణ్దవా తన మాట వినడని, చరణ్జిత్ చన్నీ అయితే, తెర వెనుక చక్రం తిప్పొచ్చునని సిద్ధూ గ్రూప్ భావించినట్లు తెలుస్తున్నది. తొలుత సుఖ్ జిందర్ రన్ధావా పేరు ఖరారు చేసినట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో దళిత నేతను సీఎంను చేయాలన్న వాదనను సిద్దూ వర్గం తీసుకొచ్చింది.
దీంతో కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్, ఏఐసీసీ పరిశీలకుడు అజయ్ మాకెన్ మరోమారు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని కాంగ్రెస్ హైకమాండ్కు నివేదిక ఇచ్చారు.ఈ సమాచారం తెలుసుకున్న సుఖ్జిందర్ రణ్దవా.. పార్టీ నిర్ణయాన్ని స్వాగతించారు.. మీ పేరు తొలుత ఖరారు చేసిందని మీడియా గుర్తు చేస్తే.. అది హై కమాండ్ నిర్ణయం అన్నారు.