చండీఘఢ్ : పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్పై పంజాబ్ హోంమంత్రి సుఖ్జందర్ రంధ్వా శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ సింగ్కు పాకిస్తాన్లో మహిళా స్నేహితురాలు ఉందని, ఆమెకు ఐఎస్ఐతో సంబంధాలున్నాయని రంధ్వా ఆరోపించారు. అమరీందర్ స్నేహితురాలిగా పరిచితమైన పాకిస్తానీ జర్నలిస్ట్ అరూస ఆలంకు ఐఎస్ఐతో సంబంధాలపై దర్యాప్తు చేపట్టాలని మంత్రి రంధ్వా పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పాకిస్తాన్ సైనికాధికారులతో అరూస ఆలం ఫోటోల గురించి ప్రశ్నించగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఎస్ఐ నుంచి పంజాబ్కు ముప్పు ఉందని కెప్టెన్ చెబుతుంటారని..అందుకే తాము అరూస ఆలంకు ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు. పంజాబ్ పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై కెప్టెన్ అమరీందర్ సింగ్ విమర్శలు గుప్పిస్తున్న నేపధ్యంలో కెప్టెన్ లక్ష్యంగా పంజాబ్ హోంమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు.