చండీగఢ్ : పంజాబ్ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 2 నుంచి పాఠశాలల తెరవాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని తరగతుల విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించింది. పాఠశాలల ఆవరణలోనూ కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా ఉధృతి కారణంగా మార్చి 12 నుంచి పంజాబ్ ప్రభుత్వం పాఠశాలలకు ప్రిపరేషన్ సెలవులు ప్రకటించింది. గత సోమవారం నుంచి ఇక్కడ 10, 11, 12వ తరగతి విద్యార్థులకు సైతం బడులు ప్రారంభమయ్యాయి. ఆరోగ్యశాఖ సూచన మేరకు పరిస్థితులకు అనుగుణంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.