అడెగామ.. కూరగాయల ధామం
ఇతర ప్రాంతాలకు ఎగుమతి
రోజుకు ఒక్కో రైతుకు రూ.3వేల సంపాదన
పంటల మార్పిడితో అధిక లాభాలు
ఆదర్శంగా నిలుస్తున్న అన్నదాతలు
ఇచ్చోడ, మార్చి 29 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడెగామ (బీ)లో మొత్తం 130 కుటుంబాలు, 563 జనాభా ఉంది. ఇక్కడ సుమారు 830 ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. వర్షకాలంలో ఇక్కడి రైతులు ప్రధాన పంటలైన పత్తి, సోయాబీన్, కందులతో పాటు యాసంగిలో శనగ, గోధుమ, మక్క, జొన్న పంటలను సాగుచేస్తారు. గ్రామంలో సుమారు 35 మంది రైతులు ఇతర పంటలతో పాటు ఒక ఎకరం, రెండు ఎకరాల్లో ప్రత్యేకంగా ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సాగు చేసే పంటలివే..
అడెగామ (బీ) రైతులు అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. కొందరు ఉపాధి హా మీలో సేద్యపు బావులను తవ్వుకున్నారు. మరికొందరు సొంతంగా బోరు బావులు వేసుకున్నా రు. పాలకూర, మెంతికూర, కొత్తిమీర, చుక్కకూర, కలెగూర, బచ్చలకూర, పుదీనా, పుంటి కూర, పువ్వు గోబీ, ఆకు గోబీ, బెండ, టమాట, వంకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, కాకర, బొ బ్బెర, అలసంత, దొండ, సోరకాయ, మిర్చి, తదితర పంటలను సాగు చేస్తున్నారు. మరికొందరు రైతులు సీజన్ను బట్టి పంటలను వేస్తున్నా రు. యేటేటా పంటల మార్పిడితో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీనికి తోడు ప్రతి రైతు ఇంటా రెండు బర్రెలు, రెండు ఆవులను పెంచుకుంటున్నారు. వాటి ద్వారా వచ్చే పాలను నిత్యం ఇచ్చోడ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నెలకు రూ.9 లక్షల వ్యాపారం..
ఆకుకూరలు, కూరగాయల ద్వారా ఆ గ్రామ రైతులు రోజుకు రూ.30 వేలపైనే ఆదాయాన్ని పొందుతున్నారు. నెలకు రూ.9 లక్షల వరకు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. సాగు చేస్తున్న ఆకుకూరలు, కూరగాయలను నిత్యం తెల్లవారు జామునే వివిధ వాహనాల్లో ఇచ్చోడ, బోథ్, ఆదిలాబాద్, గుడిహత్నూర్, నేరడిగొండ, సిరికొండ, ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ మండలాలకు వెళ్లి విక్రయిస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ రోజుకు ప్రతి రైతు సుమారు రూ.3 వేల వరకు సంపాదిస్తున్నారు.
కెనాల్కు మరమ్మతులు చేస్తే మరింత ఆదాయం
అడెగామ (బీ) గ్రామానికి ఎగువ ప్రాంతమైన అడెగామ(కే)లో అప్పటి ప్రభుత్వం 2006లో చెరువును నిర్మించింది. కానీ కెనాల్ నిర్మాణం చేపట్టలేకపోయింది. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం మూడేండ్ల క్రితం కెనాల్ నిర్మాణం కోసం రూ.2 కోట్ల నిధులను విడుదల చేసింది. గుత్తేదారు నిర్మాణం పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశాడు. ఇది పూర్తయితే ఆయకట్టుకు ఇరువైపులా ఉన్న రైతుల ఓపెన్ బావులు, బోరు బావుల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశాలున్నాయి. సంబంధిత అధికారులు కెనాల్ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటే ఏడాదంతా ఆకు కూరలు, కూరగాయలను సాగు చేస్తామని రైతులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
అను ఇమ్మాన్యుయేల్తో అల్లు శిరీష్ లవ్ స్టోరీ నిజమేనా..?