చండీఘర్ : దొంగతనాలను అరికట్టాల్సిన ఓ పోలీసే.. దొంగతనం చేసి సస్పెండ్కు గురయ్యాడు. ఈ ఘటన పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్ టౌన్లో వెలుగు చూసింది. రోడ్డు పక్కకు ఓ గుడ్ల వ్యాపారి గుడ్లతో ఉన్న బండిని ఆపాడు. ఆ తర్వాత అతను ఏదో పని నిమిత్తం పక్కకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్.. గుడ్ల బండిలో నుంచి గుడ్లను దొంగతనం చేశాడు. కోడిగుడ్లను తన ఖాకీ యూనిఫాం పాయింట్ జేబుల్లో నింపుకున్నాడు. గుడ్ల వ్యాపారి అక్కడకు రాగానే.. ఏమి తెలియనట్లు అటు నుంచి మెల్లగా జారుకున్నాడు. అటుగా వెళ్తున్న ఆటోను ఆపి అందులో ఎక్కి వెళ్లిపోయాడు.
ఈ తతంగాన్ని ఓ వ్యక్తి తన మొబైల్లో చిత్రీకరించి వైరల్ చేశాడు. గుడ్ల దొంగతనానికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ను ప్రీత్పాల్ సింగ్గా గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్ను విధుల నుంచి పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు ఆదేశించారు.