చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. కేవలం కొన్ని గంటల వరకు రోగులకు అందించే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి ఆదివారం మరో ఎస్వోఎస్ లేఖ రాశారు. పంజాబ్కు అత్యవసరంగా ఆక్సిజన్ కోటాను పెంచి సరఫరా చేయాలని కోరారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్థన్కు ఈ మేరకు ఆక్సిజన్ ఎమర్జెన్సీని మరోసారి లేఖ ద్వారా తెలియజేశారు. ఆక్సిజన్ కోసం కేంద్రానికి రెండో రోజుల్లో రెండో ఎస్వోఎస్ లేఖ పంపారు. ఆక్సిజన్ కొరత వల్ల అమృత్సర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఆరుగురు రోగులు మరణించారు. ఇందులో ఐదుగురు కరోనా పేషంట్లు ఉన్నారు.