సిద్దిపేట : జిల్లాలోని హుస్నాబాద్ పట్టణం వినాయక నగర్కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఆంజనేయులు ఇంట్లో నగదు నిల్వలు ఉన్నాయని ట్రాస్క్ఫోర్స్ పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. దీంతో శనివారం మధ్యాహ్నం స్థానిక పోలీసుల సాయంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. రూ. 66,11,100 నగదును గుర్తించి సీజ్ చేశారు. నగదుకు సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన డబ్బును ఆదాయ పన్నుశాఖ అధికారులకు అప్పగించామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ మహేందర్ తెలిపారు.