(Pune Pact) పుణెలోని ఎరవాడ జైలులో గాంధీ-అంబేద్కర్ మధ్య పుణె ఒప్పందం జరిగి ఇవాల్టికి సరిగ్గా 89 ఏండ్లు పూర్తయ్యాయి. 1932 లో సరిగ్గా ఇదే రోజున జరిగిన ఈ ఒప్పందం అనంతరం దళితులకు అందిన 2 ఓట్ల హక్కు సమస్య సమసిపోయింది. ఇదే సమయంలో దళితులకు రిజర్వ్ చేయాల్సిన స్థానాల సంఖ్య పెరిగింది.
దళితుల అభ్యున్నతే పరమావధిగా ఉన్న అంబేడ్కర్ ఒత్తిడి మేరకు.. 1909 లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం, అంటరానివారికి రిజర్వేషన్ కోసం ఒక నిబంధన తీసుకొచ్చారు. 1932 ఆగస్టు 16 న బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ఏర్పాటు చేసింది. ఫలితంగా దళితులతో పాటు అనేక సంఘాలు కూడా ప్రత్యేక ఓటర్ల హక్కును పొందాయి. అలాగే, దళితులు 2 ఓట్ల హక్కును కూడా పొందారు. రెండు ఓట్ల హక్కు ప్రకారం, దేశంలోని దళితులు ఒక ఓటు ద్వారా తమ ప్రతినిధిని ఎన్నుకోవడం.. రెండో ఓటుతో సాధారణ తరగతి ప్రతినిధిని ఎన్నుకోవాలి. దీనిని గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు. రెండు ఓట్ల హక్కు ద్వారా హిందు సమాజం విభజనకు గురవుతుందని గాంధీజీ విశ్వసించారు. ఈ నిబంధనకు వ్యతిరేకంగా నిరసన ప్రకటించిన గాంధీజీ, బ్రిటీష్ ప్రభుత్వానికి అనేక లేఖలు రాశారు.
బ్రిటీష్ ప్రభుత్వం వినిపించుకోకపోవడంతో పుణెలోని ఎరవాడ జైలులో నిరాహార దీక్షకు దిగారు. ఒకవైపు గాంధీజీ దానికివ్యతిరేకంగా ఉండటం.. మరోవైపు దళితులకు 2 ఓట్ల హక్కు వారి అభివృద్ధిలో పెద్ద మెట్టు అని అంబేడ్కర్.. ఇద్దరూ పోటీగా ఉన్నారు. ఉపవాసం కారణంగా గాంధీజీ ఆరోగ్యం క్షీణించడంతో అంబేద్కర్పై ప్రజల్లో కోపం పెరగడం మొదలైంది. చివరకు అంబేద్కర్ తలవంచవలసి వచ్చింది. బాబాసాహెబ్ 24 సెప్టెంబర్ 1932 న పూణేలోని ఎరవాడ జైలుకు చేరుకుని గాంధీతో చర్చలు జరిపారు. ఆ మేరకు గాంధీ-అంబేద్కర్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రత్యేక ఓటర్ల హక్కు, దళితులకు 2 ఓట్లను తొలగించారు. ఈ పరిణామం అనంతరం దళితులకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య పెరిగింది.
2008 : రాజీవ్గాంధీ హత్య కేసులో నళిని, మరో ఇద్దరు దోషులను ముందస్తుగా విడుదల చేయాలన్ని పిటిషన్ను
తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు
2008 : కపిల్దేవ్కు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ హోదా టెఫ్టినెంట్ హోదా
2002 : గుజరాత్లోని అక్షరధామ్లో జరిగిన కాల్పుల్లో 30 మంది మృతి
1996 : ఐక్యరాజ్య సమితిలో సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందంపై సంతకం చేసిన అమెరికా
1990 : వార్సా ఒప్పందం నుంచి వైదొలగిన తూర్పు జర్మనీ
1978 : భూగర్భ అణు పరీక్షలను నిర్వహించిన సోవియట్ యూనియన్
1971 : గూఢచర్యం ఆరోపణలపై రష్యాకు చెందిన 90 మంది దౌత్యవేత్తలను బహిష్కరించిన బ్రిటన్
1965 : యెమెన్పై సౌదీ అరేబియా-ఈజిప్ట్ మధ్య ఒప్పందం
1948 : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా కంపెనీ ప్రారంభం
1688 : జర్మనీపై యుద్ధం ప్రకటించిన ఫ్రాన్స్
డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో భారత్కు 59వ స్థానం
ఐఆర్సీటీసీ ‘లేహ్-లడఖ్’ పర్యాటక ప్యాకేజీ సిద్ధం..
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..