ఇతడు మసూద్ అజర్కు బంధువు
శ్రీనగర్, జూలై 31: భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. 2019లో జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడికి కుట్రపన్నిన ఉగ్రవాది, పాకిస్తాన్ జాతీయుడు లాంబూ (ఇస్మాయిల్ అల్వీ) ను హతమార్చాయి. పుల్వామా జిల్లాలోని అటవీప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. వీరి రాకను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడటంతో బలగాలు ఎదురకాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో లాంబూ ఒకడు. ఇతడు జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్కు బంధువు. జైషే సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. పుల్వామా ఉగ్రదాడికి కుట్రపన్నడంతో అప్పట్లో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇతడిని పట్టుకోవడానికి బలగాలు తీవ్రంగా ప్రయత్నించాయి. చివరికి శనివారం జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చాయి.
ఇద్దరు చొరబాటుదారులు కాల్చివేత
చండీగఢ్: సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఇద్దరు పాక్ చొరబాటుదారులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చివేశారు. పంజాబ్లోని తరణ్ తరణ్ జిల్లా వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్లోకి ప్రవేశించడానికి యత్నించారు.