కోల్కతా: పశ్చిమబెంగాల్లోని దిఘా బీచ్ పర్యాటకులకు ఎంతో ప్రసిద్ధి. ఇప్పుడంటే కొవిడ్ కారణంగా పర్యాటకుల తాకిడి తగ్గింది కానీ ఒకప్పుడు ఈ బీచ్ పర్యాటకులకు బెస్ట్ స్పాట్. అయితే ఇప్పుడు దిఘా బీచ్కు భారీ సంఖ్యలో చనిపోయిన చేపలు కొట్టుకొస్తున్నాయి. సోమవారం పెద్ద ఎత్తున పఫర్ చేపలు తీరానికి కొట్టుకొచ్చాయి.
కాగా, పర్యావరణవేత్తలు చేపలు చనిపోయి కొట్టుకురావడం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు. చనిపోయి తీరానికి వచ్చిన చేపలు మళ్లీ సముద్ర నీటిలో కలువకుండా జాగ్రత్తపడాలని సూచించారు. చనిపోయిన చేపలు మళ్లీ సముద్రంలో కలిస్తే సముద్రం నీరు కలుషితం అవుతుందని హెచ్చరించారు. దాంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి తీరంలో చనిపోయిన చేపలను తీసేస్తున్నారు.