సంగారెడ్డి, జూన్ 24 : రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ సూచించారు. గురువారం స్థానిక పోలీస్ కల్యాణ మంటపంలో శాంతిభద్రతలు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్ కేసులు తదితర అంశాలపై సమీక్షా నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణ, హత్యలపై చాకచక్యంగా వ్యవహరించి దోషులను పట్టుకునేందుకు పోలీసుల కృషిని ఎస్పీ ప్రత్యేకంగా అభిరందిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లాక్ ఆంక్షలు తొలగించడంతో రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా లారీ డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేసి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గు ట్కా, గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాల రవాణాపై కఠినంగా వ్యవహరించడానికి జిల్లాలో ప్రత్యేక చెక్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారితో కరోనా వైరస్ కొత్త ైస్ట్రెన్ ప్రభలే అవకాశం ఉన్నందున పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తవారు జిల్లాకు ఎవరైనా వస్తే వారిని ఐసొలేషన్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇస్నాపూర్ మహిళను హత్య చేసిన నిందితుడు మంగలి కృష్ణను పట్టుకొని, సీసీ కెమెరాల సహాయంతో ఛేదించిన పటాన్ ఇన్ అభినందించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల విచారణ పూర్తిచేసి, పెండింగ్ కేసులను తగ్గించిన పోలీసుల సేవలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు పోలీసులు తీసుకున్న జాగ్రత్తలు భేష్ ఉన్నాయని కితాబు ఇచ్చారు. ససమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ సృజన, డీఎస్పీలు నత్యనారాయణ రాజు, భీంరెడ్డి, బాలాజీ, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, డీసీఆర్ ఇన్ రామకృష్ణారెడ్డి, సబ్ డివిజన్ ఇన్ పాల్గొన్నారు.