భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్రావు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) నిర్వహిస్తున్న ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపైన్కు భారత స్టార్ షట్లర్ విజేత పీవీ సింధు ప్రచారకర్తగా ఎన్నికవడం గర్వకారణమని భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్రావు హర్షం వ్యక్తం చేశారు. ‘ఐవోసీ అంబాసిడర్గా తెలుగమ్మాయిని నియమించడం యావత్ దేశానికే గర్వకారణం. ఆటపై సింధుకున్న నిబద్ధత, నిజాయితీకి దక్కిన ప్రతిఫలం ఇది. ఆమె క్రమశిక్షణ, అంకితభావం, కష్టపడేతత్వం యువ అథ్లెట్లకు ఆదర్శం’ అని జగన్మోహన్రావు ప్రశంసించారు. భవిష్యత్తులో సింధు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.