అహ్మదాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది ప్రధాన నగరాలు సహా మొత్తం 20 నగరాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించింది. తాజాగా మరో 9 నగరాలైన హిమ్మత్నగర్, పాలన్పూర్, నవ్సారి, వల్సాద్, పోర్బందర్, బోతాడ్, వీరమ్గమ్, చోట ఉదయ్పూర్, వెరవాల్-సోమ్నాథ్ లకు కూడా కర్ఫ్యూను విస్తరించింది. ఈ 29 నగరాల్లోనూ ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి మరుసటి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ వేళలు అమల్లో ఉంటాయి. గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ వివరాలను వెల్లడించింది.
నైట్ కర్ఫ్యూతోపాటే అన్ని నగరాలు, పట్టణాల్లో షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, జిమ్లు, స్విమ్మింగ్పూల్లు, వాటర్ పార్కులు, పబ్లిక్ గార్డెన్లు, సెలూన్లు, స్పాలపై నిషేధం విధించనున్నట్లు గుజరాత్ సీఎంవో తెలిపింది. కూరగాయలు, పండ్లకు సంబంధించినవి మినహా ఇతర అన్ని రకాల మార్కెట్లను కూడా మూసివేయనున్నట్లు వెల్లడించింది. ప్రార్థానా మందిరాల్లో పూజారులకు మినహా భక్తులకు అనుమతి నిరాకరించనున్నట్లు ప్రకటించింది.
అయితే, అన్ని నగరాల్లో ప్రజా రవాణాను మాత్రం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గుజరాత్ సీఎంవో తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో 50 శాతం కెపాసిటీకి మించకుండా జనం ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నది. అదేవిధంగా పెండ్లిళ్లకు 50 మందికి, చావులకు 20 మందికి మించకుండా హాజరయ్యేందుకు కూడా గుజరాత్ సర్కారు అనుమతిచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
యూకే నుంచి భారత్కు ప్రాణాధార వైద్య సామాగ్రి: కేంద్రం
క్యాన్సర్ రోగులు టీకా వేసుకోవచ్చు
25 మిలియన్ల ప్రేమను పొందిన లాహే లాహే సాంగ్
కరోనా వేళ భారత్కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్
పదిమందిలో కలవొద్దు.. బాతఖానీ పెట్టొద్దు..