హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆరున్నరేండ్లలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్కు కొత్తగా 60 మంది సిబ్బంది నియమితులయ్యారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్తో కలిసి మంత్రి వారికి నియామకపత్రాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ విభాగంలో టీఆర్ఎస్ సర్కార్ నియామకాలు చేపట్టిందని వెల్లడించారు. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా అయ్యేందని చెప్పారు. ప్రస్తుతం అక్రమ రవాణాను అరికట్టామని, దీంతో ఆదాయం పెరిగిందని వెల్లడించారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్ రావు, రెవెన్యూశాఖ జాయింట్ సెక్రటరీ రాంసింగ్, టీఎస్బీసీఎల్ ఓఎస్డీ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.