ఇబ్రహీంపట్నం, మే 12 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఇబ్రహీంపట్నంలో సంపూర్ణంగా పాటిస్తున్నారు. ఉదయం 10 గంటలకే రోడ్లపైకి వచ్చిన పోలీసులు సాగర్హ్రదారిపై బారీకేడ్లను ఏర్పాటు చేసి రోడ్లన్ని దిగ్బంధం చేశారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో సంత ఉన్నప్పటికీ 10 గంటల తరువాత పోలీసులు తొలిగించారు. హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలోని తుర్కయాంజాల్, బొంగ్లూరుగేటు, మంగల్పల్లి, ఇబ్రహీంపట్నం, ఆగాపల్లి, యాచారం, మాల్లో పోలీసులు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. లాక్డౌన్లో అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చిన సుమారు పదిహేను వాహనాలను పోలీసులు సీజ్చేశారు. ఏసీపీ యాదగిరిరెడ్డి పర్యవేక్షణలో సీఐలు నరేందర్, సైదులు, వెంకటేశ్గౌడ్, లింగయ్య ఆధ్వర్యంలో లాక్డౌన్ విజయవంతం చేశారు. తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల సిబ్బంది కూడా పూర్తిగా లాక్డౌన్లో పోలీసులకు సహకారం అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ యాదగిరిరెడ్డి మాట్లాడుతూ..లాక్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అవసరం లేకపోయినా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. లాక్డౌన్ నుంచి మినహాయించిన వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. బ్యాంకులు, ఏటీఎంలు కూడా పనిచేయడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో మందకొడిగా సిబ్బంది రావడంతో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఇబ్రహీంపట్నంరూరల్లో..
పోల్కంపల్లి, దండుమైలారం, ముకునూరు, రాయపోల్, నెర్రపల్లి, నాగన్పల్లి, కప్పాడు, చర్లపటేల్గూడ, తుర్కగూడ, తులేకలాన్, కర్ణంగూడ, ఎలిమినేడు, పోచారం, ఉప్పరిగూడతో పాటు పలు గ్రామాల్లో లాక్డౌన్ పాటించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు.
తొలిరోజు ప్రశాంతం..
ఆమనగల్లు,మే 12 : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో తొలిరోజు లాక్డౌన్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే పట్టణంతో పాటు మాడ్గుల, కడ్తాల, తలకొండపల్లిలో అన్ని వ్యాపార, వాణిజ్య దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్డౌన్ ప్రకటనతో వలస వాసులు సొంతూరి బాటపట్టారు. ఆమనగల్లు, మాడ్గుల సీఐల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లో నిబంధనలు అతిక్రమించిన 25 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.
లాక్డౌన్ విజయవంతం
మండల కేంద్రంలో, మాల్ పట్టణంలో సీఐ లింగయ్య ఆధ్వర్యంలో చెక్పోస్టు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లాక్డౌన్కు సహకరించాలి..
లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని సీఐ స్వామి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాటసింగారం కొత్తగూడెం వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఇండ్లకు పరిమితంకావాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు జానకిరాంరెడ్డి, వీరభద్రం పాల్గొన్నారు.
మంచాలలో..
మంచాల, మే12 : సీఐ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో మంచాల, రంగాపూర్ ప్రధాన చౌరస్తాలో వాహనాల తనిఖీ కోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి ప్రజలు నిత్యావసర సరుకుల కోసం రోడ్డుపైకి వచ్చినా 10 గంటల లోపు ఇంటికి చేరుకుని లాక్డౌన్కు సహకరిస్తున్నారు. సీఐ మాట్లాడుతూ..అత్యవసర పరిస్థితిలో పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పారు.
మండలంలో ప్రశాంతంగా..
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. లాక్డౌన్ నుంచి వ్యవసాయం అనుబంధ రంగాలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేశారు. ప్రజలు ఎవరూ బయటకు రాకుండా, వాహనాలు తిరగకుండా సీఐ ఉపేందర్, ఎస్సై సుందరయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలు బంద్ కావడంతో హైదరాబాద్-శ్రీశైలం రహదారి నిర్మానుష్యంగా మారింది.