న్యూఢిల్లీ: స్పైస్జెట్ తమ దేశీయ విమాన ప్రయాణీకుల కోసం ‘జీరో చేంజ్ ఫీ’ ఆఫర్ను పరిచయం చేసింది. ఎలాంటి చార్జీలు లేకుండా టిక్కెట్లపై తేదీలు, పేర్లను మార్చుకోవచ్చు. ప్రయాణ తేదీకి వారం రోజులైనా సమయం ఉంటేనే మార్పులు చేసుకోవచ్చు. మార్చి 27-ఏప్రిల్ 4 మధ్య చేసుకున్న అన్ని బుకింగ్స్కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రయాణ తేదీలు మార్చి 27 నుంచి జూన్ 30 వరకు ఉండవచ్చన్నది. ఒక్కసారే ఉచితంగా మార్చుకోవచ్చు.
ఇవీ కూడా చదవండి