న్యూఢిల్లీ, మే 28: దేశంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎంతమంది పిల్లలు అనాథలుగా మారారో ఊహించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే వారిని గుర్తించి చేయూత అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆకలితో అలమటిస్తూ ఆ చిన్నారులు పడుతున్న బాధలను అర్థం చేసుకోవాలని సూచించింది. కోర్టుల తదుపరి ఆదేశాల కోసం వేచిచూడకుండా జిల్లా అధికారులు తక్షణమే అనాథ పిల్లలను గుర్తించే చర్యలు చేపట్టాలని ఆదేశించింది