న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 25: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభావవంతంగా పనిచేస్తున్న కోవాగ్జిన్ను 30 రోజుల్లో 30 నగరాలకు చేర్చామని ఆ వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థ భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్లా ట్విట్టర్లో వెల్లడించారు. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణె, విజయవాడ తదితర నగరాల్లో కోవాగ్జిన్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
సెప్టెంబర్కల్లా ఈయూఎల్
ఈ జూలై-సెప్టెంబర్ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నుంచి కోవాగ్జిన్కు ఎమర్జన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) అనుమతులు రావచ్చని భారత్ బయోటెక్ ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా, బ్రెజిల్ తదితర 60కిపైగా దేశాల్లో కోవాగ్జిన్ రెగ్యులేటరీ అప్రూవల్స్ ప్రక్రియ సాగుతున్నదని తెలిపింది. మరోవైపు అమెరికాలో అత్యవసర వినియోగానికి కోవాగ్జిన్పై యూఎస్ఎఫ్డీఏకు మాస్టర్ ఫైల్ను సమర్పించింది ఆక్యుజెన్. అమెరికాలో కోవాగ్జిన్ కోసం భారత్ బయోటెక్ భాగస్వామిగా ఈ సంస్థ పనిచేస్తున్నది.