న్యూఢిల్లీ, జూలై 29: కరోనా వ్యాక్సిన్ల మిక్సింగ్కు సంబంధించి సెంట్రల్ డ్రగ్ అథారిటీకి (సీడీఎస్సీవో) చెందిన నిపుణుల కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినియోగిస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల మిక్సింగ్కు అనుమతినివ్వాలని సిఫారసు చేసింది. మిక్సింగ్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు వెల్లూర్లోని క్రిస్టియానా మెడికల్ కాలేజీకి అనుమతివ్వాలన్నది. అలాగే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, ముక్కు ద్వారా ఇచ్చే బీబీవీ154 వ్యాక్సిన్ మిక్సింగ్కు కూడా అనుమతినివ్వాలని సిఫారసు చేసింది. ఈ మేరకు గురువారం అధికార వర్గాలు వెల్లడించాయి.