న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశవ్యాప్తంగా 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు (సీజేలు) నియమితులయ్యారు. ప్రస్తుతం వీరు తాత్కాలిక సీజేలుగా లేదా జడ్జిలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సీజేలుగా పదోన్నతి లభించింది. అలాగే మరో 5 హైకోర్టుల సీజేలు బదిలీ అయ్యా రు. పలు హైకోర్టుల సీజేల నియామకం, బదిలీకి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల సిఫారసులు చేసింది. వీటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పదోన్నతిపై కొత్తగా నియమితులైన సీజేలు
తెలంగాణ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, అలహాబాద్ జస్టిస్ రాజేష్ బిందాల్, కలకత్తా జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, కర్ణాటక జస్టిస్ రీతురాజ్ అవస్థీ, మేఘాలయ జస్టిస్ రంజిత్ వీ మోర్, గుజరాత్ జస్టిస్ అరవింద్కుమార్, మధ్యప్రదేశ్ జస్టిస్ ఆర్ వీ మలిమత్.
బదిలీ అయిన సీజేలు
జస్టిస్ ఏకే గోస్వామి (ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్కు), జస్టిస్ బిశ్వంత్ సొమద్దర్ (మేఘాలయ నుంచి సిక్కింకు), జస్టిస్ మహమ్మద్ రఫీక్ (మధ్యప్రదేశ్ నుంచి హిమాచల్ ప్రదేశ్కు), జస్టిస్ ఇంద్రజిత్ మహంతి (రాజస్థాన్ నుంచి త్రిపురకు), జస్టిస్ ఏఏ ఖురేషి (త్రిపుర నుంచి రాజస్థాన్కు).