నిజామాబాద్ : పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ, ప్రజలు అందరూ పాల్గొని సహకరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పారిశుద్ధ్యం సక్రమ నిర్వాహణ, నూతన డ్రైనేజీల నిర్మాణం, అవసరమైన వాడలలో రోడ్ల నిర్మాణం, ప్రాణవాయువును ఇచ్చే మొక్కల పెంపకం ఇదే పట్టణ ప్రగతి లక్ష్యమన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా బాన్సువాడ పట్టణంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటితో పాటు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుందన్నారు.
బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకూడదన్నారు. అపరిశుభ్రతతో దోమలు పెరిగి వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందిస్తాం. మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. బాన్సువాడ పట్టణంలో ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల