పారిస్: ఆర్చరీ ప్రపంచకప్లో భారత స్టార్ దీపికా కుమారి మూడు స్వర్ణ పతకాలతో అదుర్స్ అనిపించుకుంది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన దీపిక.. మిక్స్డ్ ఈవెంట్లో భర్త అతాను దాస్తో కలిసి పసిడి దక్కించుకుంది. ఇక మహిళల టీమ్ రికర్వ్ విభాగంలో దీపిక, అంకిత, కోమాలిక త్రయం పసిడి చేజిక్కించుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక 6-0తో ఎలెనా ఒసిపోవా (రష్యా)పై గెలుపొందగా.. మిక్స్డ్లో దీపిక-అతాను జంట 5-3తో నెదర్లాండ్స్ ద్వయంపై నెగ్గింది. మహిళల టీమ్ ఈవెంట్లో మెక్సికోను మన అమ్మాయిలు చిత్తుచేశారు.