కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షలను సడలించారు. 50 శాతం సామర్థ్యంతో బస్సులను అనుమతించినప్పటికీ గురువారం కోల్కతాలో ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కలేదు. ఇంధనం ధరలు పెరిగిన నేపథ్యంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడపడానికి అనుమతి ఇవ్వడం వల్ల ప్రైవేట్ బస్సులు నడపడం కష్టమని యజమానులు వాపోయారు. బస్సులు నడపడానికి డీజిల్ అవసరమని, దీని ధర ఇప్పుడు లీటరుకు రూ.93కు చేరిందని బస్సు యజమాని, డ్రైవర్ అయిన దల్చీర్ సింగ్ తెలిపారు. ప్రతి బస్సుకు 40-45 లీటర్ల ఇంధనం అవసరమని, సుమారు రూ.3000 – రూ.4000 ఖర్చు అవుతుందన్నారు. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడపాలని ప్రభుత్వం చెబుతోందని, ఇలా చేస్తే ఖర్చులను ఎలా భరించాలని, ఆదాయం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.