సెన్సెక్స్ 642, నిఫ్టీ 186 పాయింట్ల లాభం
ముంబై, మార్చి 19: స్టాక్ మార్కె ట్ల వరుస పతనాలకు బ్రేక్ పడింది. బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్లు అనూహ్యంగా లాభపడటంతో వరుసగా ఐదు రోజులుగా నష్టాల్లే చవిచూసిన మదుపరి శుక్రవారం లాభాల్లో తడిసిముద్దయ్యారు. వారాంతం ట్రేడింగ్ ప్రారంభంలోనూ సూచీలు భారీగా నష్టపోయినప్పటికీ మధ్యాహ్నం గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో తిరిగి కోలుకున్నాయి. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు వచ్చిన వార్తలతో ప్రారంభంలో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 641.72 పాయింట్లు (1.30 శాతం) లాభపడి 49,858.24 వద్ద ముగిసింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 186.15 పాయింట్లు అందుకొని 14,744 వద్ద స్థిరపడింది.