ఐఐఎం క్యాంపస్ నిర్మాణానికి నేడు ప్రధాని శంకుస్థాపన

న్యూఢిల్లీ : ఒడిశాలోని సంబల్పూర్ ఐఐఎం ( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి మిత్రులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ట్విటర్లో పిలుపునిచ్చారు. జాతీయాభివృద్ధిలో ఐఐఎంల పాత్ర గర్వకారణమని పేర్కొన్నారు.
ఒడిశా గవర్నర్ గణేషీలాల్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి రమేశ్ పొక్రియాల్, ధరేంద్ర ప్రధాన్, ప్రతాప్ చంద్ర సారంగి సైతం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. వర్చువల్ విధానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అధికారులు, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, ఐఐఎం సంబల్పూర్ అధ్యాపకులు, సిబ్బంది పూర్వ విద్యార్థులు మొత్తం 5 వేల మంది పాల్గొననున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్గాంధీ
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?
- రకుల్ కోవిడ్ రికవరీ జర్నీ- వీడియో
- కాంగ్రెస్ అధికారంలోలేదు.. భవిష్యత్లో రాదు
- మెరుగుపడుతున్న శశికళ ఆరోగ్యం..!
- ఓటు నమోదు చేసుకోండి : మంత్రి కేటీఆర్