కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. కరోనా నియంత్రణపై కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ కొరత, సామర్థ్యం పెంపు, విదేశీ టీకాల దిగుమతిపై చర్చించారు. ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజక్షన్ల కొరత, ఇతర అంశాలపై ఆరా తీశారు.
టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్కు మరో ప్రత్యామ్నాయం లేదని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాలకు అదనపు బెడ్లను సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అలాగే లక్ష ఆక్సిజన్ సిలిండర్లను సేకరించి రాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. మంజూరైన 162 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు వేగవంతం చేయాలని ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి