ఈశ్వరిపుర్: బంగ్లాదేశ్లో ఉన్న శక్తి పీఠం జెశోరేశ్వరి కాళీ ఆలయాన్ని ఇవాళ ప్రధాని మోదీ సందర్శించారు. రెండు రోజల పాటు బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆయన ఆ ఆలయంలో ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్కిరా జిల్లాలోని ఈశ్వరిపుర్ గ్రామంలో జెశోరేశ్వరి ఆలయం ఉన్నది. దుర్గామాతకు చెందిన 51 శక్తి పీఠాల్లో జెశోరేశ్వరి ఆలయం కూడా ఒకటి. జెశోర దేవి పేరు మీద ఆ ఆలయం వెలసినది. బంగ్లాదేశ్లో ఉన్న ప్రసిద్ధ ఆలయాల్లో ఇది ఒకటి. ప్రతి ఏడాది వేల సంఖ్యలో భారత్లోని హిందువులు ఈ ఆలయాన్ని విజిట్ చేస్తుంటారు. కాళీ పూజ జరిగే రోజున ఇక్కడకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 13వ శతాబ్ధంలో ఈ ఆలయంలో జీర్ణోద్దరణ జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. లక్ష్మణసేన, ప్రతాపాధిత్య ఈ ఆలయ పునర్ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.