మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
జిల్లా కేంద్రంలో మహిళలతో కలిసి ఆసనాలు
మంచిర్యాల అర్బన్, జూన్ 21 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో వాసవీ క్లబ్, అష్టోత్తర యోగాపీఠ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రోజూ సాధన వల్ల శారీరక రుగ్మతలు, మానసిక ఒత్తిడి నుంచి దూరమవుతామన్నారు. అనంతరం అందరితో కలిసి ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆమె యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజ య్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్, బీజేపీ నాయకులు వెరబెల్లి రఘునాథ రావు, వాసవీ క్లబ్ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిరిపురం రాజేశ్, అంతర్జాతీయ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కటకం హరీశ్, కోశాధికారి కొండా చంద్రశేఖర్, వీకేఎస్పీ జిల్లా ఇన్చార్జి అప్పాల శ్రీధర్, పుల్లూరి బాలమోహన్, కాచం సతీశ్, కేశెట్టి వంశీకృష్ణ, నల్మాసు ప్రవీణ్, అష్టోత్తర యోగా పీఠ్ యోగా గురువు గుండా విజయ్కుమార్, సభ్యులు ముక్త వేణు, కోలేటి రవి, తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..
బెల్లంపల్లి రూరల్, జూన్ 21: పట్టణంలోని నంబర్ -2 గ్రౌండ్లో స్వామి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన యోగా దినోత్సవానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో కలిసి ఆసనాలు వేశారు. అనంతరం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు.