న్యూఢిల్లీ : రాజస్థాన్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత జగన్నాథ్ పహాడియా (89) మృతి పట్ల భారత ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర విచారణకు గురిచేసిందని పేర్కొన్నారు. పహాడియా కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధీర్ఘ రాజకీయ నేతగా, పాలనాధికారిగా భవిష్యత్ ప్రజల సాధికారత కోసం పహాడియా ఎంతో కృషి చేశారని ప్రధాని అన్నారు. రాజస్థాన్ రాష్ట్రం ఓ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పహాడియా మృతి పట్ల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.