పెరగనున్న టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు!

న్యూఢిల్లీ: కొత్త ఏడాదికి ఇంట్లోకి ఓ కొత్త టీవీయో, వాషింగ్ మెషీనో, రెఫ్రిరేజరో కొనాలని అనుకుంటున్నారా? అయితే ఆ పనేదే వెంటనే చేసేయండి. ఎందుకంటే జనవరిలో వీటి ధరలు 10 శాతం వరకూ పెరగనున్నాయి. కాపర్, అల్యూమినియం, స్టీల్తోపాటు రవాణా ఛార్జీలు కూడా పెరగడంతో ఈ పెంపు తప్పకపోవచ్చని కంపెనీలు చెబుతున్నాయి. అంతేకాకుండా టీవీ పానెళ్ల ధరలు దాదాపు రెండింతలు పెరిగాయని, ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్లాస్టిక్ కూడా భారమైందని తయారీదారులు వాపోతున్నారు. జనవరి నుంచి ధరలు పెంచడం ఖాయమని ఇప్పటికే ఎల్జీ, పానసోనిక్, థామ్సన్లాంటి కంపెనీలు స్పష్టం చేశాయి. అయితే సోనీ మాత్రం ధరలపై ఇంకా సమీక్ష జరుపుతోంది.
10 నుంచి 11 శాతం పెంపు?
విడి భాగాల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో తమ ఉత్పత్తుల తయారీ ఖర్చు కూడా పెరుగుతుందని, అందువల్ల జనవరిలో ధరల్లో 6-7 శాతం పెరుగుదల తప్పదని పానసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ చెప్పారు. ఈ ధరలు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసే నాటికి 10-11 శాతానికి పెరగవచ్చనీ అభిప్రాయపడ్డారు. అటు ఎల్జీ ఇండియా కూడా జనవరి 1 నుంచి తమ కంపెనీ అన్ని ఉత్పత్తులపై 7 నుంచి 8 శాతం ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నట్లు ఆ సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తెలిపారు. అటు సోనీ మాత్రం ధరల పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ చెప్పారు.
తాజావార్తలు
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి
- కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షోకు రెడీ అంటున్న ప్రియమణి
- యూకేలో జూలై 17 వరకు లాక్డౌన్ పొండగింపు
- పెళ్లికి ముందు కారు యాక్సిడెంట్ చేసిన వరుణ్