హైదరాబాద్ : బోనాల పండుగ కోసం ప్రభుత్వం రూ.15కోట్లు విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం గోల్కొండ కోటపైనున్నజగదాంభిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే మొదటి బోనం పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నిధులతో ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, శానిటేషన్, దేవాలయాల వద్ద లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కొవిడ్ నియమాలు పాటిస్తూ వేడుకలు నిర్వహించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న గోల్కొండ బోనాలు, అమ్మవారివారి ఘటోత్సవంతో ప్రారంభం కానుండగా.. 25న సికింద్రాబాద్ (లష్కర్) బోనాలు, జూలై 26న రంగం కార్యక్రమాలు జరుగనున్నాయి.