న్యూఢిల్లీ : సామాజిక సాంకేతిక నిపుణుడు చింతన్ వైష్ణవ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) మిషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈయన ఈ నెలాఖరుకు మిషన్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు నితీ ఆయోగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. చింతన్ వైష్ణవ్.. రామనాథన్ రమణన్ స్థానంలో ఏఐఎం రెండవ మిషన్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
వృత్తిపరంగా ఇంజనీర్ అయిన చింతన్ వైష్ణవ్.. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి డాక్టరేట్ అందుకున్నారు. చింతన్ వైష్ణవ్ పరిశోధకుడుగా, ఎంఐటీ అధ్యాపకుడిగా సేవలందించారు. ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ మిషన్కు మిషన్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి వ్యవస్థాపకతను పెంచే ప్రయత్నానికి నాయకత్వం వహించనున్నారు. ఏఐఎం మిషన్ డైరెక్టర్గా రామనాథన్ రమణన్ నాలుగేండ్ల పాటు సేవలందించారు.
చింతన్ వైష్ణవ్ ఎన్నో సంస్థలను నెలకొల్పారు. టెక్నాలజీ, అభివృద్ధి, ప్రజా విధాన సవాళ్లను పరిష్కరించడంలో స్టార్టప్లు, కార్పొరేషన్లు, ప్రభుత్వానికి చురుకుగా సలహా ఇస్తున్నారు.
ఆవిష్కరణల్లో అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్నారని నితీ ఆయోగ్ పేర్కొన్నది. గత నాలుగేండ్లలో అటల్ ఇన్నోవేషన్ మిషన్.. ఆవిష్కరణలు, స్టార్టప్లు తమ సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడే బహుళ టింకరింగ్ ల్యాబ్లు, ఇంక్యుబేటర్లను అమలు చేసింది. వివిధ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి బహుళ వాటాదారులతో కలిసి పనిచేసింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) కింద దేశవ్యాప్తంగా 650 జిల్లాల్లోని పాఠశాలల్లో 7,259 టింకరింగ్ ల్యాబులు నెలకొల్పారు.
బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు న్యాయమూర్తులను నియమించిన సుప్రీంకోర్టు
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళను అమ్మేసిన దుర్మార్గుడు
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న దావానలం
అణగారిన వర్గాల గొంతుక బాబుజీ.. చరిత్రలో ఈరోజు
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..