హైదరాబాద్ : స్వదేశంలో ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. ‘ఇంగ్లాండ్పై 3-1 తేడాతో టెస్టు సిరీస్ నెగ్గిన భారత జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విజయంతో భారత్ ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్కు చేరడం.. ఐసీసీ ర్యాంకింగ్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరడం ఆనందాన్ని ఇచ్చింది. భారత జట్టు తొలి రెండు టెస్టులు గెలిచిన అద్భుత స్టేడియాన్ని ప్రారంభించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఫైనల్లో అద్భుత ఆటతీరు కనబరిచిన ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు’ అని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు.