న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన రెండో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయన రెండో కంటికి చేసిన కంటిశుక్లం ఆపరేషన్ విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ కార్యాలయం తెలిపింది. దీంతో కోవింద్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. కాగా, రాష్ట్రపతి రామ్నాథ్ ఈ ఏడాది ఆగస్ట్ 19న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మొదటి కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. నాటి శస్త్రచికిత్స కూడా విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ కార్యాలయం వెల్లడించింది.