న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం కంటి శుక్లానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు క్యాటరాక్ట్ సర్జరీ జరిగినట్లు రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పారు. దీంతో ఆసుపత్రి నుంచి రాష్ట్రపతి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. కాగా, 75 ఏండ్ల రామ్నాథ్ కోవింద్, 2017 జూలై 25న దేశ 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.