కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, మే 21 : జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని, రేపటి నుంచి మరింత పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిచందన తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో కొవిడ్ నియంత్రణ చర్యలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇంటింటి సర్వే మొదటి ఫేజ్ పూర్తి కాగా, రెండో ఫేజ్ సైతం పూర్తి చేయాలని సీఎంకి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శైలజ, వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, శివప్రసాద్ పాల్గొన్నారు.