కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలు, పత్రాలు, వీడియోలను భద్రపరచాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం సీఎం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన సువెందు అధికారిపై రెండు వేల కన్నా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. తిరిగి లెక్కించాలన్న మమత విజ్ఞప్తిని ఈసీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
మమత పిటిషన్పై న్యాయమూర్తి షాంపా సర్కార్ బుధవారం ఆన్లైన్ ద్వారా విచారణ జరిపారు. ఆన్లైన్ విచారణలో పాల్గొన్న మమతా బెనర్జీ, పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, రిగ్గింగ్, డబ్బుల పంపిణీ, ఓట్ల కోసం ద్వేషం, శత్రుత్వాన్ని పెంపొందించడం వంటి అవినీతి పద్ధతులకు పాల్పడ్డారని సువెందుపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్ పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలు, పత్రాలు, వీడియోలను భద్రపరచాలని ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్, రిటర్నింగ్ అధికారితోపాటు సువెందు అధికారికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 12కు వాయిదా వేసింది.