ధర్మపురి,మార్చి31: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తర దిగ్యాత్ర ఘట్టాన్ని బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి (యోగా, ఉగ్ర) ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చి సేవలపై ఉంచారు. భక్తుల కోలాహాలం మధ్య ఉత్తర దిక్కున ఉన్న ఉసిరిక చెట్టువద్దకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద వేదపండితుడు బొజ్జ రమేశ్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య దిగ్యాత్ర పూజలు చేశా రు. చీకటిపడిన తర్వాత స్వామివార్లను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. యజ్ఞాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల నేతృత్వంలో ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాసాచార్య, నరసింహమూర్తి, రమణాచార్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్కుమార్,ఎస్ఏ అలువాల శ్రీనివాస్ ఉన్నారు.
మార్మోగిన క్షేత్రం
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం భక్తుల నారసింహనామస్మరణలతో క్షేత్రం మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి చేరుకు న్న భక్తులు గోదావరిలో స్నానాలు చేశారు. ప్రధా న, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను ద ర్శించుకొన్నారు. ఆలయపక్షాన పాత టీటీడీ కల్యా ణ మండపంలో గురువారం సుమారు 2వేల మందికి అన్నదానం చేశారు. ఇక్కడ ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, మాజీ ధర్మకర్త లు ఇనుగంటి వెంకటేశ్వర్రావు, మురికి భాగ్యలక్ష్మి, జెట్టి రాజన్న ఆర్యవైశ్యనేతలు మురికి శ్రీనివాస్, రంగ శంకరయ్య, కొండ వినయ్, పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు భక్తులకు భోజనాలను వడ్డించారు. కాగా. బ్రహ్మోత్సవాల్లో భా గంగా గురువారం సాయంత్రం స్వామివారి ఉత్తర, దక్షిణ దిగ్యాత్ర, రాత్రివేళలో భోగమండప ఉత్సవాలు నిర్వహిస్తామని ఈవో తెలిపారు.
నర్సన్న ఆదాయం రూ.33 లక్షలు
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదా యం బుధవారం 41రోజుల హుండీ విప్పి లెక్కించగా, రూ.33 లక్షల 779ల ఆదాయం సమకూరినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఇందులో మిశ్ర మ బంగారం 55గ్రాములు, 8కిలోల 50గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు వెల్లడించారు.