లక్నో: ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలో దారుణం జరిగింది. తనతోపాటు సహజీవనం చేసే వ్యక్తే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్నగర్కు చెందిన అమిత్ మౌర్య తనకు 2019లో పరిచయమయ్యాడని, అప్పటి నుంచి ఇద్దరం సహజీవనం చేస్తున్నామని బాధితురాలు తెలిపింది.
పెండ్లి చేసుకుంటానని చెప్పి ఇన్నాళ్లుగా తనపై అత్యాచారం చేసిన అమిత్ మౌర్య ఇప్పుడు గర్బం దాల్చిన తర్వాత ముఖం చాటేశాడని, తనను పెండ్లి చేసుకోనని తెగేసి చెప్పాడని బాధితురాలు ఆరోపించింది. అంతేగాక ఒక అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి తనకు అశ్లీల చిత్రాలను పంపించేవాడని కూడా మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.