బంగ్లాను చిత్తుచేసిన భారత్
దోహా: నాయకుడు ముందుండి నడిపించడంతో ఫిఫా ప్రపంచకప్ (2022), ఆసియా కప్ (2023) సంయుక్త క్వాలిఫయర్స్లో భారత ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ (79వ, 92వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించడంతో సోమవారం ఇక్కడ జరిగిన పోరులో భారత్ 2-0తో బంగ్లాపై జయభేరి మోగించింది.