కోల్కతా, జూలై 5: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఇన్నాళ్లు కాంగ్రెస్లో ఉన్న ఆయన.. సోమవారం టీఎంసీ కండువా కప్పుకున్నారు. టీఎంసీ సీనియర్ నాయకుడు సుధీప్ బంధోపాధ్యాయ ఆయనను టీఎంసీలోకి ఆహ్వానించారు. ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన టీఎంసీలో చేరిన అనంతరం మాట్లాడుతూ.. బెంగాల్లో బీజేపీని నిలువరించడంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయవంతమయ్యారని ప్రశంసించారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా కాషాయపార్టీని టీఎంసీ నిలువరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.