మారేడ్పల్లి, ఏప్రిల్ 27: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జేమ్స్స్ట్రీట్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం- 2లో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఈ క్రమంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు రాగా… ఒక్కసారిగా దానికింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.