తిరువనంతపురం: శబరిమల కోసం ప్రత్యేక చట్టం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే మ్యానిఫెస్టోను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం విడుదల చేశారు. కేరళ సంపూర్ణ అభివృద్ధిపై తమ మ్యానిఫెస్టో దృష్టిసారించిందని తెలిపారు. ఉద్యోగాల కల్పన, ఆకలి, భీభత్స రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, శబరిమల, లవ్ జిహాద్పై ప్రత్యేక చట్టం, హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు వంటి హామీలను ప్రకటించారు.
కేరళలో సీపీఎం, కాంగ్రెస్ మధ్య విభేదాలు నాటకమని ప్రకాష్ జవదేకర్ ఈ సందర్భంగా విమర్శించారు. బెంగాల్లో వాహపక్షాలతో కాంగ్రెస్ దోస్తి, కేరళలో కుస్తి అని ఎద్దేవా చేశారు.