న్యూఢిల్లీ: బీజేపీకి చెందిన భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. ఎంపీలకు యోగా క్లాసు తీసుకోనున్నారు. ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీలకు వర్చువల్ రీతిలో యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. యోగాపై ప్రాక్టికల్ సెషన్స్తో పాటు లెక్చర్లు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని లోక్సభ సెక్రటేరియేట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీల కోసం పార్లమెంటరీ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ శాఖ యోగా సెషన్ను ఏర్పాటు చేస్తున్నది. మొత్తం నాలుగు భాగాలు యోగా కార్యక్రమాలు ఉంటాయి. యోగా గురువు అమి దేశాయ్ తొలి సెషన్లో పాల్గొంటారు. రోహతక్ ఎంపీ సుమేదానంద సరస్వతి.. యోగా అండ్ మెడిటేషన్ ఫర్ హోలిస్టిక్ వెల్ బీయింగ్ అంశంపై క్లాసు తీసుకుంటారు. ఇక భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. యోగా: ఏ వే ఆఫ్ లైఫ్ అన్న అంశంపై క్లాసు తీసుకోనున్నారు.