న్యూఢిల్లీ, జూలై 22: స్టెరాయిడ్ల చికిత్స అనంతరం కొవిడ్-19 నుంచి కోలుకున్న రోగుల కాలేయంలో కొన్ని గడ్డలను గుర్తించినట్టు ఢిల్లీలోని సర్ గంగారాం దవాఖాన వైద్యులు గురువారం తెలిపారు. వైరస్ నుంచి కోలుకున్న 14 మంది రోగుల కాలేయంలో గడ్డలున్నట్టు చెప్పారు. సాధారణంగా ఎంటమోబా హిస్టోలిటికా అనే పరాన్నజీవి కారణంగా కాలేయంలో ఇలాంటి గడ్డలు ఏర్పడుతాయని.. కలుషిత నీరు, ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందన్నారు.