పాట్నా: కేవలం చట్టాల ద్వారా జనాభా నియంత్రణ సాధ్యం కాదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావడంపై ఆయన స్పందించారు. అధికారంలో ఉన్న వారు కోరుకున్నది చేసే స్వేచ్ఛ, అధికారం ప్రతి రాష్ట్రానికి ఉందన్నారు. అయితే కేవలం చట్టాల ద్వారా జనాభా నియంత్రణ అసాధ్యమని అన్నారు. దీనిపై తన అభిప్రాయం చాలా స్పష్టంగా ఉన్నదని తెలిపారు. మహిళలు విద్యావంతులైతే వారిలో చైతన్యం వస్తుందని, అప్పుడు సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని నితీశ్ కుమార్ చెప్పారు.