భువనేశ్వర్: ఒడిశాలో కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఇంటి వద్దకే పోలీస్ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ దాస్ తెలిపారు. 100కు డయల్ చేస్తే పోలీసులు స్పాట్కు వచ్చి ఫిర్యాదును స్వీకరిస్తారని చెప్పారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫిర్యాదుదారుడికి ఎఫ్ఐఆర్ ప్రతిని అందజేస్తామని వివరించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్కు రాలేకపోవడం, నిస్సహాయ పరిస్థితిలో ఉండకూడదన్న ఉద్దేశంతో ఇంటి వద్దకే పోలీస్ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ దాస్ వెల్లడించారు.